Author: Sujanaranjani

అబ్బూరి ఛాయాదేవి

సుజననీయం
ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడే వదనం....ప్రశాంతత నిండిన చూపులు....సంభాషణల్లో అలవోకగా అమరి కురిసే చమత్కారాలు ....అమ్మలా ప్రతిఒక్కరితో అతిమృదువుగా పలకరింపులు.....అవును ఆవిడే అబ్బూరి ఛాయాదేవి. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆరోజుల్నిబట్టి ఆడపిల్లలకి పెద్ద చదువులు చెప్పించడం ముఖ్యం కాదు పెళ్ళి తొందరగా చేసెయ్యాలి అన్న పద్ధతి పాటించారు ఆమె తరఫు పెద్దలు. ప్రసిద్ధ సాహితీవేత్త అబ్బూరి రామకృష్ణరావుగారి కోడలిగా ప్రసిద్ధ రచయిత విమర్శకులు అయిన అబ్బూరి వరద రాజేశ్వరరావుగారి సతీమణిగా సంసారజీవితంలో అడుగు పెట్టారు ఛాయాదేవిగారు. రాజేశ్వరరావుగారితో సాహితీచర్చలు జరిపేందుకు ప్రముఖ కవులు రచయితలు వారి ఇంటికి వచ్చేవారుట. స్వతహాగా ఆమెకు కూడా సాహిత్యం పట్ల చాలా ఆసక్తి ఉండడం వలన ఆమెకూడా ఆచర్చల్లో పాల్గొనేవారుట. ఆవిధంగా ప్రముఖ కవులు రచయితలు తనకు పరిచయ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
తొలిమెట్టు అని భావిస్తోంది. వ్యక్తి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించటం నేర్చుకోవాలి. మానవ అంతర్వికాసం భౌతిక దృక్పథం వల్ల కలగదు. ఆధ్యాత్మికంగా మనిషి పురోభివృద్ధి చెందినప్పుడే మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలనే విషయం ఇప్పుడిప్పుడే అన్ని దేశాలవారూ గ్రహిస్తున్నారు. భారతదేశం ఆధ్యాత్మింగా సుసంపన్నదేశం. ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక దృష్టిని అలవరచుకొని ప్రతి మనిషి అంతర్వికాసాన్నీ, వ్యక్తి విలువలను కలిగి ఉన్నాడు. రాను రానూ పాశ్చాత్య ప్రభావం వల్ల దేశంలో అన్ని వేదమాతను వీడిపరప్రదేశం పట్ల ఆకర్షితుడయ్యాడు. పాశ్చాత్యులు మనిషిని బాహ్యంగానే వికసింప చేయగలిగారు కానీ అంతరంగికమైన వికాసానికి ఏమాత్రం కృషి చేయలేదు. వారు మనిషిని కేవలం సాంఘిక జంతువు (Social being)గానో, రాజకీయ జంతువు (Political being)గానో, ఆర్ధికజీవి (Economic being)గానో చూశారు. అంతేకాని వారి పరి

రామాయణ సంగ్రహం జులై 2019

ధారావాహికలు
రావణుడు మహోదగ్రంగా మధుపురం మీద పోయి పడ్డాడు. అన్న రాక విన్న కంభీనసి వల వల ఏడుస్తూ వచ్చి అన్నపాదాల మీద వాలిపోయింది. ‘అభయం' ఇస్తే గాని లేవనన్నది. మన్న్ననగా అభయం ఇచ్చాడు రావణుడు. ‘నన్ను అనాథను చేయవద్దు. నా పసుపు కుంకుమ నిలబెట్టు' అని వేడుకుంది. ‘సరే! మంచిది! ఏడీ నీ భర్త. నేను ఇంద్రుడిపై దండయాత్ర చేయడానికి వెళుతున్నాను. నీ భర్తను కూడా నాకు సహాయంగా రమ్మను' అన్నాడు రావణుడు. ఆ రాత్రి చెల్లెలింట సత్కారం పొంది మర్నాడు మధురాక్షసుణ్ణి కూడా వెంటబెట్టుకుని సకల సేనా పరివారంతో పయనించి కైలాస పర్వతప్రాంతంలో కుబేరుడి అలక పట్టణం సమీపంలో సేనతో విడిది ఏర్పాటు చేసుకున్నాడు రావణుడు. అది వెన్నెల రాత్రి. వసంత ఋతువు కూడా నేమో! ప్రకృతి రమణీయంగా ఉంది. దూరం నుంచి అచ్చరాల ఆటలూ, గందర్వుల పాటలూ వినవస్తున్నాయి. మలయా పవనమూ, వివిధ పుష్పసుగంధమూ రావణుణ్ణి మదన బాణ వివశుణ్ణి చేస్తున్నాయి. ఇంతలో ఒక దివ్యంగాన సర్వాలంకారభూషితురాల

వీక్షణం-82

వీక్షణం
వీక్షణం 82వ సమావేశం కాలిఫోర్నియాలోని మోర్గాన్ హిల్ లో డా||కె.గీత గారింట్లో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. సంప్రదాయం ప్రకారం డా||కె.గీత, భర్త శ్రీ సత్యన్నారాయణ గారితో బాటూ కలిసి సభకు ఆహ్వానం పలికారు. ఈ సభకు శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముందుగా "తెలుగురచయిత.ఆర్గ్" నుండి శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి "ఉద్వేగాలు" కథను సభకు శ్రీ కిరణ్ ప్రభ చదివి వినిపించారు. రాజు, శేషి అన్నా చెల్లెళ్లు. కథా ప్రారంభంలో "ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ల