Author: Sujanaranjani

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
శ్రీరామరావణుల ప్రచండయుద్ధం – రావణసంహారం అప్పుడు శ్రీరాముడు భూమిమీద నిలిచి రథస్థుడై ఉన్న రావణుడితో పోరాడటం బాగాలేదని దేవతలంతా మాతలి సారథిగా ఆయన రథాన్ని రాముడికి సాయం కోసం పంపవలసిందని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు మాతలి రాముడి దగ్గరకు ఇంద్రుడి రథాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు సంతోషంతో దాని నెక్కి పరమభయంకరంగా రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు ఏ అస్త్రం ప్రయోగిస్తే మళ్ళీ ఆ అస్త్రంతోనే దాన్ని నిస్తేజం చేశాడు రాముడు. మహాసర్పసంభరితమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించగా రాముడు గరుడాస్త్రంతో దాన్ని రూపుమాపాడు. అప్పుడు రావణాసురుడు మహోగ్రుడైనాడు. బాణవర్షం రాముడిమీద కురిపించాడు. రాముణ్ణి ఆయన రథసారథి మాతలిని నొప్పించాడు. ఆ రథధ్వజాన్ని ఒక బాణంతో కొల్చాడు. దేవేంద్రుడి గుర్రాలకు కూడా తన ప్రతాపం చూపాడు. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, మహర్షులు కూడా రాముడి ఈ సంకటస్థితి చూసి విషాదం పొ

విశ్వామిత్ర 2015 – నవల ( 15వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు సిబిఐ గెస్ట్ హౌస్ లో ఎడంచేయికి, కాలుకి కట్లతో అభిషేక్ సోఫాలో, కుడిచేతికి చిన్న ప్లాస్టర్ వేసుకుని రాజు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. జగదీష్ అభిషేక్ ఎదురుగుండా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అభిషేక్ మొహం చాలా సీరియస్ గా ఉంది. అభిషేక్ అడిగాడు "జగదీష్ మీకు, నాకు రాజు, రవిబాబుకి తప్ప ఇంకెవరికీ కేసుకు సంబంధించినవాళ్ళు దాబాలో పార్టీ చేసుకుంటున్నట్టు తెలియదు.మీరెవరికైనా చెప్పారా?రాజు,రవిబాబుల దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.వాళ్ళెవ్వరితోనూ మాట్లాడలేదు." జగదీష్ ఒక నిముషం తటపటాయించాడు."ఇంకొక్కమాట.మీరు సమాధానం చెప్పబోయేముందు చంపబడ్డ ఆ నలుగురు వ్యక్తులని గుర్తుపెట్టుకోండి"జగదీష్ మొహం ఎర్రగా మారింది. "నేను హోమ్ మినిష్టర్ గారితో మాట్లాడాను" "థాంక్యూ. అన్నట్టు, జగదీష్, నిన్న మన కస్టడీలోకి తీసుకున్నఆ గ్రాండియోర్ హోటల్ కేప్టెన్, అదే దాబ

నాన్న

కవితా స్రవంతి
- అమరవాది రాజశేఖర శర్మ కంటిరెప్పగా చేనుకు కంచె లాగ ప్రేమతో నన్ను కాపాడి పెంచెనాన్న కష్టములనెన్నొ పొందినా కలత పడక కోరు కోర్కెల నన్నిటిన్ కూర్చె నాన్న లోక రీతిని సంఘపు లోతు తెలిపి మంచి వ్యవహర్తగా నన్ను మలచె నాన్న వేలుపట్టుకు నడిపించి వెంట ద్రిప్పి మంచి చెడుల వివేకము పంచె నాన్ పండుగలు సంబరాలలో మెండు ముదము నాకు నందించి నావెంట నాడె నాన్న అలుకబూనిన ననుగని పలుకరించి కొత్త బొమ్మలు వరముగా కురిసె నాన్న నేననారోగ్యమున్ గన తాను నిద్ర భోజనము మాని దేవుళ్ళ పూజ సేయు నేను రాయు పరీక్షన నేర్పు కోరి సతతముపవాస దీక్షలన్ సలుపు నాన్న

పిల్లలు-పెద్దలు

కవితా స్రవంతి
- పారనంది శాంత కుమారి విదేశాలకు వెళ్లిపోతూ విచిత్రంగా పిల్లలు, వారిబుద్ధి నెరగలేక విచారంతో పెద్దలు. రెక్కలొచ్చి అక్కడికి ఎగిరిపోయిన పిల్లలు, ముక్కలైన మనసుతో ఇక్కడే మిగిలిపోయిన పెద్దలు. కొత్త ఉద్యోగంలో అక్కడ పిల్లలు, కొత్త ఉద్వేగంతో ఇక్కడ పెద్దలు. అక్కడ సంపాదనకై ప్రాకులాడుతూ పిల్లలు, ఇక్కడ మనోవేదనతో మగ్గిపోతూ పెద్దలు. అక్కడ సంపాదించుకున్నడబ్బులతో పిల్లల జల్సాలు, ఇక్కడ ఆపాదించుకున్నజబ్బులతో పెద్దల నీరసాలు. ఇక్కడున్న పెద్దలదృష్టి తమపిల్లల పైనే, అక్కడున్న పిల్లలదృష్టి మాత్రం వాళ్ళపిల్లల పైనే. భార్యాపిల్లలే లోకం అక్కడ పిల్లలకి, పిల్లలు దూరమై శోకం ఇక్కడ పెద్దలకి. గంటలను కేష్ చేసుకుంటూ అక్కడ పిల్లలు, నిముషాలను లెక్కపెట్టుకుంటూ ఇక్కడ పెద్దలు. అక్కడ కాస్ట్లీ ఇల్లు కొనుక్కొని పిల్లలు, ఇక్కడ కాటికి కాళ్ళు చాచుకొని పెద్దలు. అక్కడ శాశ్వత నివాసంకై ఆ దేశం గ్రీన్ కార్డు కోసం పిల్లఎదురు

ఆత్మవిశ్వాసం!!

కవితా స్రవంతి
--ఎస్.ఎస్.వి.రమణరావు వందమందైనా అబద్ధం చెబుతుంటే ఎదిరించి ఒక్కడైనా నిజం చెబితే గుర్తించి వాడి పక్క నిలబడ గలవా నువ్వు? నలుగురు కలిసి పనిచేస్తే పొరపాట్లు జరిగే అవకాశం తక్కువని ఒక్కడే అంతపనీ చేస్తే పొరపాట్లు పెరిగే అవకాశం ఎక్కువని తెలుసుగా నీకు? నువ్వు చేసిన తప్పులు ఎదుటి వాడి తప్పుల్ని క్షమాదృష్టితో చూసేందుకు నువ్వు పొందిన ఓటమి ఎదుటివాడి ఓటమిని సానుభూతితో పరిశీలించేందుకు తోడ్పడుతున్నాయా? తప్పులు చేసినవాళ్ళు తప్పించుకు తిరుగుతున్నంతకాలం తప్పులు జరుగుతూనే ఉంటాయని శిక్షా భయం లేనిదే నేరాలు తగ్గవని వేరే చెప్పక్కర్లేదుగా? స్వార్థంకొద్దే కాక సమాజం కోసం ఎంత సహనం చూపించగలుగుతున్నావు నువ్వు? ఎంత సమయం ఎంత ధనం వెచ్చించగలుగుతున్నావు నువ్వు? సుఖాలకి లొంగిపోకుండా దుఃఖాలకి కృంగిపోకుండా వర్తమానంలో కనబడుతున్న దుర్భర గతాన్ని మార్చుతూ అందమైన భవిష్యత్ సౌధాన్ని పునాద

భక్త ధృవ

బాలానందం
-మొదటిరంగం- [సునీతి పూజచేస్తూ ,పాటపాడుతుంటుంది [మహరాజు ఉత్తానపాదుడు వస్తాడు ] దేవీ! సునీతీ! [సునీతి పూజనుండీ లేచి వచ్చి ] -ప్రభూ దయచేశారా! రండి! ఉత్తానపాద- ఏమి చేయుచుంటివి దేవీ! సునీతి- మరేముంది ప్రభూ!మన దేశప్రజలందరినీ హాయిగా ,ఏకష్టాలూ లేకుండా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ప్రభూ! ఉత్తాన- నీకెప్పుడూ ఆప్రార్ధనేనా !నాగురించీ ఏమాత్రమూ శ్రధ్ధ లేదా! సునీతి-ప్రభూ! అదంతా మీ గురించే! మన ప్రజలంతా హాయిగా ఉంటే మీరూ హాయిగా ఉంటారుకదా! సమస్యలోకాః సుఖినో భవంతు ఉత్తాన - [లేచి] హూ! నీవదే చేసుకపో![ కోపంగా వెళ్ళిపోతాడు] సునీతి- ప్రభూ ! ప్రభూ! -2వ రంగం- సురుచి పూలమాల అల్లుతుంటుంది. ఉత్తానపాదుడు వస్తాడు. ఉత్తాన- సురుచీ! సురుచీ! సురుచి-ప్రభూ !దయచేయండి . ఆశీనులుకండి { అంటూ పూలమాల అతడి మెడలో వేస్తుంది] ఉత్తాన _ ఆహా! ఈ పుష్పాలు ఎంత మధురమైన సువాసనతో ఉన్నాయి? ఎక్కడిది దేవీ ఈమాల? సురుచి- ప్ర

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – విప్రలబ్ధ - టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత తెలుసుకుందాం. “క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా| స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో చెప్పాడు. "ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు" అని అర్థము. భానుదత్తుడు రసమంజరిలో "సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|" – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయు

ప్రారబ్ధ కర్మలు

సారస్వతం
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే 'విధి' కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట

రండి! కాళన్నను ఆవాహన చేసుకుందాం!!

సారస్వతం
 - సంగిశెట్టి శ్రీనివాస్‍   1937లో 23 యేండ్ల వయసులో నిజామాబాద్‍ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజి నారాయణరావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయిండు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్‍ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్ళిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్‍గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన, పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసిన తిప్పి కొట్టిండు. తోటి వారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ళ పర్యంతమయ్యిండు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజి నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవా