Author: Sujanaranjani

బ్రహ్మ తేజస్సు

కథా భారతి
-అన్నపంతుల జగన్నాధ రావు (ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది) ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు. ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ

శాంతి చిరునామా?

బాలానందం
(బాలల కథ) -ఆదూరి.హైమవతి ధర్మపురం అనే ఊర్లో ధర్మన్న అనేఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు.పేరులోనే తప్ప 'ధర్మ 'మనేది అతగాడి జీవితం లో లేనేలేదు. ఎంగిలిచేత్తో కాకిని కూడా అదిలించని పరమ పిసినారి. బాగాలాభాలు వచ్చివ్యాపారం ఎదిగినా అతడి బుధ్ధి మాత్రం మారలేదు. తనవద్ద పనిచేసే గుమాస్తాలకు, ఇతర పని వారికీ జీతాలు పెంచడు సరికదా సకాలంలో నెల జీతం ఇవ్వడు. ఐతే అంతా ఉద్యోగ భద్రతవల్ల, మానకుండా అతగాడివద్దే పని చేస్తున్నారు. ఇంట్లో సైతం సరుకులు సమంగాతెచ్చేవాడుకాదు. భార్యా పిల్లలూ అన్ని అవసరాలకూ అతగాడ్ని దేబిరించి, విసిగిపోయేవారు. కాస్తఅనువైన బట్టలూ కొనడు. అతడి భార్య సీతమ్మ, పిల్లలను సముదాయించు కుంటూ ఓర్పుగా సంసా రాన్ని, నెట్టుకొస్తున్నది. సరైన చీరలైనా లేక సీతమ్మ ఏ ఇంటికీ పేరంటా నికైనా వెళ్ళేదికాదు. అంతా ఆమెను అదోలా చూసేవారు. ధర్మయ్య వ్యాపార వ్యవ హారాలతో, ఇంట్లో భార్యా పిల్లలు వారి అవసరాల కోసం సొమ్ము, వస్తువులు అడుగ

వీక్షణం సాహితీ గవాక్షం-69 సమీక్ష

శీర్షికలు
- విద్యార్థి వీక్షణం 69వ సమావేశము విలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి నాడు, అనగా మే 13వ తారీఖున శ్రీయుతులు గీతా మాధవి, సత్యనారాయణ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ రోజు అమెరికా దేశస్తుల మాతృ దినోత్సవం అవటం కూడా ఒక ప్రత్యేకత. ఈ సభకు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ఈ నాటి ముఖ్య అతిధి శ్రీ చెన్నకేశవ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, "వారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో తెలుగు ఎన్సైక్లోపేడియా విభాగాధిపధిపత్యం తో బాటు పలు బాధ్యతలు నిర్వహించారు". శ్రీ చెన్నకేశవ రెడ్డిగారిని తెలుగులో గేయ రచన గురించి చేసిన పరిశోధనని ప్రశంసించారు. శ్రీ చెన్నకేశవ రెడ్డిగారి ప్రసంగ విశేషములు ' గేయం గతి ప్రధానమైనది. గతులు నాలుగు. అవి త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు. కావ్యమంటే కథ, పాత్రలు, రసపోషణ, ధ్వని, వస్త్వైక్యం, అలంకారాలు, వర్ణనలు మొదలగు కావ్యా

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: నిషిద్ధాక్షరి: క, చ, ట, త, ప లు లేకుండా వేసవి సెలవలను వర్ణిస్తూ ఛందోబద్ధముగా పద్యము వ్రాయవలెను గతమాసం ప్రశ్న: పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ నందిని పూజజేసి శివ నామము త్రాణగ భక్తిమీ రగన్ సందియ మేమిలేక మది చల్లని భావము పొంగు చుండగా వందనమో యటంచు తలవంచి మహామహితాత్ముడే యనన్ పందిని కౌ

విశ్వామిత్ర 2015 – నవల ( 22 వ భాగము )

ధారావాహికలు
-ఎస్ ఎస్ వి రమణారావు విశాఖపట్టణం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్,వచ్చీపోయే ప్రయాణీకులతో రద్దీగానే ఉంది.ఎయిర్ ట్రావెలర్స్, ఇండియా మొత్తంలో ఏపిలోనే అధికంగా ఉన్నారని వచ్చిన న్యూస్ సర్వే నిజమే అని ధృవీకరిస్తున్నాట్టున్నారు జనం. సమయం ఉదయం పదకొండు గంటలైంది. ఎయిర్ పోర్ట్ కారిడార్ ని ఆనుకుని ఉన్న ఇన్నర్ రోడ్ ఒకటుంది.విఐపి కార్లు, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ కారులు మాత్రమే అక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది.ఆరోడ్డులోకి పొలీస్ రక్షక్ వేన్ లు నాలుగు, ఫ్యాక్షనిష్ట్ సినిమాల్లో సుమోల్లాగా దూసుకు వచ్చాయి.అందులోంచి చక చక క్రమబద్ధమైన బూట్ల చప్పుడుతో దిగారు పోలీసులు.సరిగ్గా ఏడు నిమిషాల్లోఎయిర్ పోర్ట్ అంతా సరౌండ్ చేసేశారు.అన్నివేన్ లకి ముందున్న కారులోంచి ఫ్యాక్షన్ లీడర్ లాగా దిగాడు జగదీష్.అతడి మొహం వెలిగిపోతోంది.అందుకు కారణం ఉంది.అమెరికానుంచి వయా ఢిల్లీనుంచి వస్తున్న విశ్వామిత్రని అరెస్ట్ చేసి దారిలోనే కాల్చి చంపేయమని

యత్నం

కథా భారతి
- శ్రీమతి మోచర్ల రామలక్ష్మి సద్గురువులు, సాధకులు, యోగులు, త్యాగులు, పండితులు, కవులు ఎందఱో మహానుభావులు. చతుర్వేదాల సారాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, సుభాషితాలు, నీతి శతకాలు, సూక్తులు, చాటువులు, సామెతలతో నిబిడీకృతం చేసి మానవాళి అభ్యున్నతికి అందించారు. దేవభాష అయిన సంస్కృత భాషలోని సూక్తులను, సుభాషితాలను, నేటితరం పిల్లలతో, గౌరవనీయులయిన పెద్దలతో, హితులతో, సన్నిహితులతో ముచ్చటించు కావాలనేది నా అభిలాష. సరస్వతీదేవి కృపతో కథావాటికలో సూక్తులు, సుభాషితాలు పొందుపరిచి, చిన్న కథలుగా రూపొందించి పుస్తక పాణి పద పల్లవములకు సమర్పిస్తున్నాను. సంస్కృత అధ్యాపకులు మా గురువర్యులు శ్రీమాన్ మోహనరావుగారి పాదాలకు నమస్కరిస్తూ కథ ఆరంభిస్తున్నాను. సుందరం చక్కనివాడు. చురుకు, తెలివి కలవాడు, బాగా చదువుకుని ఉత్తమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. తను ఎంతో మేధావినని, ఉద్యోగం తనని వెదుక్కుంటూ వస్తుందని అతనిని కించిత్ గర్వం ఆ

పనికత్తి

కవితా స్రవంతి
- తమిరిశ జానకి గ్యాస్ మీద వంటేనా ఇరవైనాలుగ్గంటలూ నీళ్ళొస్తాయా విమ్ సోపేనా తోమేందుకు బట్టలుతికే మిషనుందా ఆరేసేందుకు నువ్వు నాకు సాయంచేస్తావా ఒకపూటే ఇల్లూడుస్తా వారానికోసారే పోఛా చేస్తా రోజూ చాయ్ నాస్తా ఇస్తావా పండగ పండగకీ కొత్తచీరిస్తావా రెండునెల్లకోసారి పాతచీరిస్తావా ఆదివారాలు సెలవిస్తావా అదికాక నెలకి నాలుగైదురోజులు మానేస్తే నాగాలు కట్టకుండా ఉంటావా పెద్ద టీ.వీ.ఉందా పనికీ పనికీ మధ్య నాకిష్టమైన సీరియలే పెడతావా ఏరోజు ఏసీరియల్లో ఎక్కువ ఏడుపు నాకొచ్చినా ఆరోజు పని పూర్తిగా చెయ్యలేను నువ్వే చేసుకోవాలి మరో చాయ్ ఎగస్ట్రా ఇవ్వాలి ఓ.కే.నా ఆన్నింటికీ ఊ అంటే చెప్పు ఇప్పుడే పన్లోకి ఉరుకుతా కత్తిలా దూసుకుపోతా నీ పని చూసుకుంటా ! ****

చిత్ర రంజని జూన్ 2018

చిత్ర రంజని
మిల్పీటస్ పట్టణంలోని రాంచో మిడిల్ స్కూల్ (ఋఅంచొ ంఇద్ద్లె శ్చూల్) విద్యార్థులు ఆర్ట్ క్లాసులో (ఆర్త్ ఛ్లస్స్) గీసి, గ్రంథాలయంలో ప్రదర్శించిన చిత్రాల్లోని నలుపు-తెలుపు (భ్లచ్క్ అంద్ వ్హితె) చిత్రాలు కొన్ని. (ఛ్రెదిత్ తొ స్తుదెంత్స్ అంద్ థైర్ తేచెర్ ఝమెస్ ఛౌల్సొన్)