సారస్వతం

నేను శివుణ్ణి!

సారస్వతం
​-శారదాప్రసాద్   మన జీవితాల్లోమనం ముఖ్యంగా మూడు కష్టాలను ఎదుర్కోవాలి, అధిగమించాలి! అవి--దైవికం, దేహికం మరియు భౌతికం. దైవికం అంటే-- దైవ ప్రేరేపితాలు. అంటే తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు. దేహికం అంటే-- శారీరకమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధులు. భౌతికం అంటే-- సామాజిక, మానవ సంబంధాలతో కూడిన సమస్యలు, గొడవలు, అపార్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, రాగబంధాలు...మొదలైనవి. ఎవరైతే వీటిని అధిగమించి, ఇతరులు కూడా అధిగమించటానికి సహాయం చేస్తారో, అటువంటి వారిని మాత్రమే జ్ఞానులు, ముముక్షువులు, మోక్షాన్ని పొందినవారని అంటారు. అట్టివారే నిజమైన గురువులు మరియు మార్గదర్శకులు. అంతే కానీ, దేవతల సహస్రనామాలను,భజనలను చేయమని చెప్పి వాటిని చేయించేవారు కేవలం గురువు వేషంలో ఉన్న లఘువులు! చిత్తశుద్ధి లేకుండా (ఉన్నప్పటికీ) తెల్లవార్లు రామనామ జపం చేస్తే ఏమీ రాదు.రాకపోగా, నిద్రలేమితో అనారోగ్యం సంభవిస్తుంది.అంతర్యా

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
శృంగార దూతికలు -టేకుమళ్ళ వెంకటప్పయ్య దూతికలు అనగా రాయబారులు. నాయకుని తరఫున నాయికతో, నాయిక తరఫున నాయకునితో శృంగార దూతకార్యం నెరపడానికి నియోగించే వారు. అన్నమయ్య వీరిని రాయబారపు పడతి, చెలికత్తె అంటాడు. అలంకార శాస్త్రాలలో దాసి, సకియ, దాది, నటి, పొరుగమ్మ, యోగిని, చాకలి, చిత్రకర్మ చేయు స్త్రీలు దూతికలుగా వ్యవహరిస్తారని ఉన్నది. ఇంకా తాంబూలమమ్మే స్త్రీలు, వంటకత్తెలు, గానము మరియూ నాట్యము నేర్పే స్త్రీలు దూతికలుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కి పారిజాత పుష్పం ఇచ్చిన సందర్భంలో అలాంటి దూతికయే సత్యభామకు విషయం చేరవేసింది. ఆ దూతిక చెప్పిన మాటలవలన కోపించిన సత్యభామను శ్రీకృష్ణుడు ఎంతో బ్రతిమాలవలసి వచ్చింది. చివరకు స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించవలసి వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవారితో సంధాన సందర్భంలో స్వామి ఎరుక వేషాన్ని ధరించడం తెలిసిందే గదా! ఆమెకూడా ఒక దూతికయే.

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

సారస్వతం
పొలాలనన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ- విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరులకాయం నిండా కాలువకట్టే ఘర్మ జాలానికి, ఘర్మ జాలానికి, ధర్మ జాలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్! నరాల బిగువూ, కరాల సత్తువ వారాల వర్షం కురిపించాలని, ప్రపంచభాగ్యం వర్థిల్లాలని- గనిలో, పనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, వరివ్లవిస్తూ, ధనిక స్వామికి దాన్యం చేసే, యంత్రభూతముల కోరలు తోమే, కార్మికధీరుల కన్నులనిండా కణకణమండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్! లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చేవేదన, దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే బాటలుతీస్తూ, పాటలు వ్రాస్తూ, నాలో కదలే నవ్యకవిత్వం కార్మికలోకపు కల్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి, సమర్పణంగా, సమర్చనంగా వాస్తవ జగత్తుని మనోజ్ఞంగా చిత్రించటంలో

అజామిళుడు

సారస్వతం
-శారదాప్రసాద్​ ఇది శ్రీ మహాభాగవతంలోని కధ.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం యొక్క అంతరార్ధం ఈ కధలో ఇమిడి ఉంది.ఆ శ్లోకం ఏమిటంటే--"యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,"అంటే ,జీవుడు దేనిని గూర్చి స్మ‌రించుచు శ‌రీర‌మును చాలించునో అద్దానిని గూర్చియే పున‌ర్జ‌న్మ‌మును పొందుచున్నాడ‌ని అర్ధం! ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము.జడభరతుని కధ దీనికి చక్కని ఉదాహరణ. జ‌డ‌భ‌ర‌తుడు యోగియైన‌ప్ప‌టికిని మ‌ర‌ణ స‌మ‌య‌మున ప్ర‌గాఢ‌ముగ‌నున్న మ‌మ‌కార‌ము వ‌ల‌న జింక‌నుగూర్చి యోచించుచు ప్రాణ‌ముల‌ను చాలించినందువ‌ల‌న మ‌రుజ‌న్మ‌మున జింక‌యై జ‌న్మించెను. దాదాపుగా అటువంటిదే ఈ అజామిళుడి కధ కూడా! కేవలం మరణ సమయంలో మాత్రమే నారాయణ నామ స్మరణ చేయటంవలన అజామిళుడు మోక్షాన్ని పొందాడు.ఇక అజామిళుడి కథను గురించి తెలుసుకుందాం! ​కన్యాకుబ్జం అనే పట్టణంలో అజా

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
స్థూలంగా వివేచిస్తే శ్రీశ్రీ వర్గరహితమైన సమాజాన్ని, ఆర్ధిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించాలాని ప్రభోదించినాడు. ఆర్ధికాభ్యున్నతి సాధించినా జాతిజీవనం ఆధ్యాత్మిక ధర్మ చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవవికాసం సంపూర్ణమౌతుందనీ, అప్పుడే సమసమాజం సాధ్యపడుతుందనీ విశ్వనాథ ప్రభోదించాడు. ఒకరు ఆర్ధిక ధర్మానికి ప్రాధాన్యమిస్తే, మరొకరు హార్థిక ధర్మానికి ప్రాణం పోశారు" భావకవి ఊహాలోకాల్లో ఊరేగుతాడనీ, లోకం పట్టనివాడనీ సమాజంలో కొందరు కవులు భావించారు. ఆత్మాశ్రయ కీర్తనంగా, ప్రణయకీర్తనంగా పేరుగాంచిన భావకవిత్వం సమాజావసరాలు తీర్చలేదని భావించటం జరిగింది. ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు' అని భావకవి, ‘మనసారగ ఏడ్వనీరు నన్ను' అని బజారున పడటంతో కృష్ణశాస్త్రి బాధంతా లోకానికీ బాధ అయికూర్చుంది. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అంతా యథార్థంమటుకు కాదు. కవి ఎప్పుడూ తన కోసం కవిత్వం రాసుకోడు. ఈ సందర్భంలో వెల్చేరు నారాయణరావుగ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – అభిసారిక - టేకుమళ్ళ వెంకటప్పయ్య "మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్| జ్యోత్స్నాతమస్వినీయానయోగ్యాంబరవిభూషణా| స్వయం వాభిసరేద్ యా తు సా భవేదభిసారికా"|| (రసార్ణవసుధాకరము) మదనానలసంతప్తయై ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాని, వెన్నెల రాత్రులలో, చీకటిరాత్రులలో తన్నితరులు గుర్తింపనిరీతిగా వేషభూషలను ధరించి రహస్యముగా ప్రియుని గలియుటకు సంకేతస్థలమునకు బోవునది గాని, అభిసారిక యనబడునని పైశ్లోకమునకు అర్థము. కానీ ఈ అభిసారిక నాయికలలో ఉన్న స్వల్ప బేధాలను గమనిస్తే మొదటి రకమైన యభిసారిక సామాన్యముగా నొక దూతిక ద్వారా సందేశమును పంపి, ప్రియుని తనకడకు రప్పించుకొనును. అతడు వచ్చినప్పుడు వాసకసజ్జికవలెనే సర్వము సంసిద్ధము చేసికొని అతనితో సవిలాసముగా గడపును. ఇట్లు ఈవిధమైన అభిసారికకు, వాసకసజ్జికకు, కించిద్భేదమే యున్నది. వస్తుతః శృంగారమంజరీకర్త వంటి కొందఱు లాక్షణికులు ఈరకమైన అభిసారికను వాసకసజ్జికగానే ప

ఎవరీ రాధ?

సారస్వతం
-శారదా ప్రసాద్ రాధ,రాధిక,రాధారాణి,రాధికారాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతం లోనూ, జయదేవుని 'గీత గోవిందం'లోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి.అందుకే శ్రీ కృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది.శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృషుని వయసుకన్నా పదేళ్ళు తక్కువ.అయితే రాధ శ్రీకృష్ణుని కన్నాపెద్దదని చెప్పటానికి ఒక వింత కథ ప్రచారంలో ​ఉంది. ఆ కథను కూడా పరిశీలిద్దాం. రాధ ఒక ​గుడ్డి పిల్లగా జన్మించినదని ప్రచారంలో ​ఉంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని కొన్ని కారణాల వల్ల తన కన్నా ముందుగా జన్మించమని కోరాడు.  లక్ష్మీదేవి, శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా, ఒక షరతుపై, ఆమె అందుకు అంగీకరించింది. శ్రీ కృష్ణుణ్ణి చూసే వరకూ, కన

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
భావకవితాయుగ ప్రతినిధిగా కృష్ణశాస్త్రిని చెప్పుకున్నా ఆయన మధ్యమమణిలా ప్రకాశించినవాడు. కాబట్టి ఆధ్యంతాలూ పరిశీలిస్తేనే కానీ భావకవితాయుగంలోని అనుభూతి తత్త్వాన్ని చర్చించినట్లూ కాదు. ఈ నవ్యకవితానికి నాందీ వాక్యం పలికింది ఎవరన్న వివాదం జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రాయప్రోలు, గురజాడవారలు చెరో రీతిలో నవ్యకవిత్వ లక్షణాలను వెల్లడించారని చెప్పుకోవచ్చు. ప్రణయ కీర్తనం గురజాడవారిలో ఉన్నా, సంస్కరణాభిలాష వారిలోని తీవ్రత. “మర్రులు ప్రేమని మదిదలంచకు మరులు మరలును వయసుతోడనె మాయమర్మములేని నేస్తము మగువలకు మగవారి కొక్కటె బ్రతుకు సుకముకు రాజమార్గము" వంటి గేయాలలో ప్రేమకీర్తన కన్పిస్తుంది. సమకాలీనంలో దేశంలో ఉన్న కులాల కుమ్ములాటలను చూసి, “మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండెకులములు మంచియన్నది మాలయైతే మాలనే అగుదున్" అని ఎలుగెత్తి చాటాడు. ఈ విధంగా సంస్కరణవాదిగా ప్రేమను వ

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
అలాగే గురజాడ అప్పారావుగారూ సంఘసంస్కరణ పతాకగా వెలిగారు. “ధూమకేతువు కేతువనియో మోము చందురు డలిగి చూడడు? కేతువాయది? వేల్పు లలనల కేలి వెలితొగ కాంచుమా!’’ అని చెప్పి ప్రజలలో ఆలోచనని రేకెత్తింప చేశారు. మగడు వేల్పన్న పాతమాటను, స్త్రీపురుష సంబంధాన్ని గురించి, బూజుపడ్డ పాతభావాలనీ కడిగివేశాడు. ఈ విధమైన రచనల్లో అనుభూతి జ్ఞాన చైతన్య ప్రవృత్తిని ఆశ్రయించి (Intellectual Domain) ప్రకాశించిందని చెప్పుకోవచ్చు. ఆంగ్ల విద్యా ప్రభావంవల్ల తెలుగు భాషలో నవలలు, నాటకాలు, కధలు, విమర్శలు, జీవితచరిత్రలు మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగుబాషలో తమ తమ స్థానాలను ఆక్రమించుకుంటూ వచ్చాయి. నవలలు పౌరాణికాలుగా, చారిత్రకాలుగా, సామాజికాలుగా - మరెన్నో విధాలుగా విభాగాన్ని కలిగి ఉన్నా ప్రధానంగా నవల కాల్పనిక చైతన్యానికి (Emotional Domain) కి సంబంధించిది. ఇంగ్లీషులో Fiction విభాగానికి చెందిన నవల కల్పనలకి చెందినదై, ఊహల అల్లికకు చెంద

పేరులో (name) నేముంది​!

సారస్వతం
​-శారదాప్రసాద్ ​​​ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినపుడు,మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి వెళ్ళటం జరి​గింది. వాళ్ళూ తెలుగు వాళ్ళే. ఆ అమ్మాయి తల్లి తండ్రులు,అత్తా మామలు అందరూ హైదరాబాద్ లో స్థిరపడ్డా​రట. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు.​ ​' అమ్మా ! నీ పిల్లల పేర్లేమిటీ?'​ ​అని ఆ అమ్మాయిని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో​ ​అడగటం జరి​గింది. అందుకు ఆ అమ్మాయి​ ​'అంకుల్! మా పెద్ద అమ్మాయి పేరు 'తుషి',రెండవ అమ్మాయి పేరు 'మాయ​' అని చెప్పగానే నేను బిత్తరపోయాను. 'తుషి అంటే అర్ధం ఏమిటమ్మా?' అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి 'నాకు తెలియదండి,'త' కారం వచ్చేటట్లు పేరు ​ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి​ ​'​ ​పిల్లల పేర్లు' అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి' అని గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు చెప్పింది.మరి మీ పెద్దవారి సలహా తీసు​కోలేదా?​ ​అని నేనడి