Month: December 2017
తెలుగుకు జేజేలు!
- తాటిపాముల మృత్యుంజయుడు
డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదు మహానగరంలో తెలంగాణా ప్రభుత్వం 'ప్రపంచ తెలుగు మహాసభలు ' నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలెట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనున్న ఉద్ధండుల్ని, అలాగే విదేశాల్లో నున్న తెలుగు సాహిత్య, భాషా సేవకుల్ని పేరుపేరునా పిలుస్తూ, బొట్టుపెట్టి ఆహ్వానించడం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. ప్రాంతీయ భేదాలు పొడసూపకుండా ఎక్కడ వున్నా అందరం తెలుగుసంతతి వారమే అన్న ధోరణి అవలంబించడంలో తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా హర్షించాలి. ఈ విధానం తెలుగుభాషా వికాసానికి, తెలుగు సాహిత్యం ఔన్నత్యానికి దోహదం చేస్తుంది. ఈ సంతోష సమయంలో, పండగ వాతావరణంలో మన తెలుగు పెద్దలు చెప్పిన తీయని పలుకులు పునశ్చరణ చేసుకొందాం.
చైయెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతొ ఘనకీర్తి కలవాడా
(వేములపల్లి శ్రీకృష్ణ)
తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు
తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు
(కొసరాజు)
పేరులో (name) నేముంది!
-శారదాప్రసాద్
ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినపుడు,మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళూ తెలుగు వాళ్ళే. ఆ అమ్మాయి తల్లి తండ్రులు,అత్తా మామలు అందరూ హైదరాబాద్ లో స్థిరపడ్డారట. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. ' అమ్మా ! నీ పిల్లల పేర్లేమిటీ?' అని ఆ అమ్మాయిని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో అడగటం జరిగింది. అందుకు ఆ అమ్మాయి 'అంకుల్! మా పెద్ద అమ్మాయి పేరు 'తుషి',రెండవ అమ్మాయి పేరు 'మాయ' అని చెప్పగానే నేను బిత్తరపోయాను. 'తుషి అంటే అర్ధం ఏమిటమ్మా?' అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి 'నాకు తెలియదండి,'త' కారం వచ్చేటట్లు పేరు ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి ' పిల్లల పేర్లు' అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి' అని గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు చెప్పింది.మరి మీ పెద్దవారి సలహా తీసుకోలేదా? అని నేనడి
తెలుస్తుందా..?!
-దేవనపల్లి వీణావాణి
ఎడిటర్ గారికి నమస్సులు.. నేను వ్రాసిన " తెలుస్తుందా...?" కవితను సుజన రంజని కొరకు అందజేయుచున్నాను... ఈ కవిత యొక్క ఉద్దేశ్యం... భక్తి ముసుగులో తోటి మనుషుల మీద జరుగుతున్న దాడి.
అదిగో..అక్కడ .. జనసంద్రంలో..
తామర తూళ్లూ, తాటి పళ్ళూ,
ఇప్ప పూలూ, రెల్లు పరకలు..
కపోతాలు, కాకులు బకాలు...,సీతాకోకలు...
చరిత్ర దిద్దిన చిత్రిక... రంగు పూల పొత్తి...!
ఇప్పుడు... వదులైన కుంచెలా
విడివడ్డ దారాలు..! మెదళ్లను విధికి
దేహాల్ని వీధులకీ విసిరేసి
వెలుగు మొహం తెలియని
గబ్బిలాళ్లలా తోడేళ్ళ పొదివి మీద
వేలాడుతున్నాయ్...! చిన్న వానకే
దీపానికి ముసురుకున్న
ఉసుల్ల పుట్టలా అర్థం కాకున్నా
ఎగురుతున్నాయ్...!
తినడానికే పెంచుకున్న కోడిపిల్లలై
గొఱ్ఱె దాటుడు నేర్చుకున్న కప్పల్లా
పాముల గూటికి పరుగెడుతున్నయ్...!
ఎప్పుడు తెలుస్తుందో
బతుకు నిచ్చెఁ మెతుకు గొప్పదని
మట్టిని మెతుకు చేసిన
చెమట గొప్ప
ఎవరవయా నీవెవరవయా?
-డా.బి.బాలకృష్ణ
నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది
నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం
తన మూలాలను వెతుక్కుంటున్నది
తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో
అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి
రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు
ఎక్కడినుండో ఓ కదలిక
నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది
మూసలో దాచబడిన ఈ జీవం
తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది
నేను ఎవరు? నా గమ్యమేమిటి?
నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది?
ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు
నన్ను తొలుస్తూనే ఉంటాయి
సంద్రంలో ఎగసిన అల విసురుగా
తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు
అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు
ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి
ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి
అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి
రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో
ఒక్కోసారి నిన్ను గుర్తు
విశ్వామిత్ర 2015 – నవల ( 17వ భాగము )
– యస్. యస్. వి రమణారావు
మర్నాడు పొద్దున్న ఉదయం పొద్దున్న ఎనిమిదింటికి త్రీటౌన్ కానిస్టేబుల్ రాజు సెల్ ఫోన్ గట్టిగా మోగడంతో ఉలి్క్కిపడి లేచాడు. ఎస్సై కేతుబాబు నుంచి ఫోన్. "హోమ్ కొడుకు సురేష్ ఫోన్ చేశాడు. నిన్నేదో గొడవైందంట గదా,నీకు తెలుసంట గదా. అమ్మాయంట గదా. కంప్లయింట్ గూడా ఇచ్చారంట గదా?ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలోకి తోసెయ్యమంటున్నాడు.ఇంకా అరెస్ట్ చేయలేదా అని చిందులు తొక్కుతున్నాడు.మనకెవడు బాసో నాకైతే అర్థం కావటం లేదు.అది సరేలే సురేష్ మనోడే కదా. నిన్నరాత్రే ఎందుకు అరెస్ట్ చేయలేదు?"
"సురేష్ ఫ్రెండ్స్ కి దెబ్బలు చాలా బలంగా తగిలాయి సార్.నేను నిన్న వాళ్ళని హాస్పటల్ లో చేర్పించక పోయుంటే కండిషన్ ఇంకా చాలా క్రిటికల్ గా ఉండేది సార్. వాళ్ళని హాస్పటల్ లో జేర్పించడం, వాళ్ళ దగ్గర్నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ పూర్తిచేశాను సార్.అవన్నీ పూర్తయ్యేసరికే తెల్లవారుఝాము ఐదయిపోయింది సార్.
కపట పూజ
-ఆదూరి. హైమావతి
కనపర్తి అనే గ్రామంలో కామయ్య అనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అంత ధనం ఉన్నా పిల్లి కైనా బిచ్చం పెట్టేవాడు కాదు. ఎంగిలిచేత్తో కకినైనా అదలించేవాడుకాదు. పరమ పిసినారి. ఇలా ఉండగా ఓ మారు ఆ గ్రామానికి ఒక ముని వచ్చి ఆ ఊరి శివాలయంలో, హిమాలయాల నుండి తెచ్చిన శివ లింగాన్ని ప్రతిష్టించి నిత్యం పంచామృతాలతో అభిషేకం చేయసాగాడు. ఊరి జనమంతా తమ వంతుగా పాలు పెరుగు, నెయ్యి, వంటివి తీసుకెళ్లి అభిషేకంలో పాల్గొన సాగారు. అంతా తన ఇంటిముందు నుండే వెళ్లడం, తనకేసి హేళనగా చూడటం సహించలేక పోయాడు కామయ్య.
- ఒక అల్లరివాడు ‘ఎంతమంది వచ్చినా కామయ్యగారు ఆలయానికి రారులేవోయ్! పాపం ఆ పాలు, పెరుగు అమ్ముకుంటే నాల్గు డబ్బులు వెనకేసుకోవచ్చు. శివలింగానికి అభిషేకం చేస్తే ఏం వస్తుంది చెప్పు" అని నవ్వుకోవడం చూసి రోషం వచ్చింది. అయినా సేరు పాలు చూస్తూ చూస్తూ ఆ రాతిమీద పోయడం ఎలా?’ అని కామయ్య మనసొప్పలేదు. రాత్రంతా ఆలోచించి ఉపాయం ప
జ్యోతిషము నమ్మదగినదేనా ?
-క వ న శర్మ
నా లక్ష్యం
ఒక వైపున, జ్యోతిషమును సైన్సు సమర్ధించదు అని , సైన్సు తెలిసిన కొందరు ఉద్దండ పండితులు చెప్తూ ఉంటె , హేతువాదులుగా చెలామణి అయ్యే మహామహులు జ్యోతిషము ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మ వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు.దానికి ఎన్నో ఉదాహరణ లిస్తారు
మరో వైపు అది ఋషి ప్రోక్తమని నమ్మదగినదేనని వాదించే ఉద్దండ జోస్యులు ఉన్నారు . వారీ జోస్యం నిజమైన ఎన్నో ఉదాహరణ లిస్తారు. వీరే కాకుండా , తమ విషయం లో , లేక తమ వారి జీవితాల్లో ఫలించిన జోస్యాల గురించి చెప్పే పామరులు , విద్యావంతులు కూడా అసంఖ్యాకులు అనేకులు ఉన్నారు.
సైన్సు క్షుణ్ణం గా తెలిసిన మరి కొందరు, అది ఎందుకు నమ్మదగినదో సైన్సు పరం గా సమర్ధిస్తూ స్వానుభవ పూర్వకం గా వివిరిస్తూ ఉంటారు .
ఈ మూడింటిని సమీక్షించటం నేను చెయ్య బూనుకున్న పని . నాకంటే బాగా తెలిసిన వారు పూనుకుంటే బావుంటుంది. కాని వారికి దీనిపై సమయం వెచ్చించటానికి తీరిక ఉండక పోవటం,