ధారావాహికలు

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
యముడితో రావణుడి యుద్ధం ఇక అప్పుడు యముడు స్వయంగా రావణుడితో యుద్ధం చేశాడు. మృత్యుపాశం, కాలదండం ధరించి రావణుడిపైకి వచ్చాడు. ఇట్లా ఏడు రోజులు రాత్రింబవళ్ళు యముడికీ, రావణుడికీ జగద్భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మదేవుడితో అక్కడకు చేరుకున్నారు. మృత్యుదేవత వీణ్ణి కబళిస్తానని ముందుకు రాగా, యముడు వారించి వీణ్ణి నా కాలదండంతో హతమారుస్తానన్నాడు. ఇంతలో బ్రహ్మ అక్కడకు వచ్చి యముడితో 'నా వరాలు వ్యర్థమైపోతాయి. వీణ్ణి ఇట్లా చంపవద్దు' అని జోక్యం చేసుకున్నాడు. అప్పుడు యముడు అసహనంతో అంతర్థానమైనాడు. ‘నేనే జయించాన'ని రావణుడు లోకం దద్దరిల్లే గర్జనలు చేస్తూ పుష్పకం ఎక్కి తన నివాసానికి వెళ్ళాడు. ఆ తరువాత రావణుడు పాతాళలోకం పైకి దండెత్తాడు. భోగవతి దాని రాజధాని. రావణుడు అక్కడకు చేరాడు. వాసుకిని వశపరచుకొన్నాడు. అక్కడ నుంచి నివాతకవచులనే క్రూరరాక్షసులు ఎవరికీ కనపడకుండా నివా

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
సూక్ష్మంలో మొక్షంలాగా చటుక్కున పాఠకుడికి అనుభూతిని అందించ కలిగేవి ఖండకావ్యాలు, మినీకవితలే. ఈనాటి ఈ ఆధునిక కవితకు జీవితం భావచిత్రమే. ఈ భావచిత్రమే మినీ కవితకి కానీ, ఖండకవితకి కానీ రూపాన్నిస్తున్నది, నియమిస్తున్నది, దానిని అనుభవంగా పర్యవసింపచేస్తున్నది. ఈ భావచిత్ర తరంగాలే ఖండకావ్యాలకు రూపాన్నీ, గుణాన్నీ కల్పిస్తున్నాయి. అనుభూతికవిత భావచిత్రాలతోనే రూపుకడుతుంది. వాటినే అనుభూతులుగా పరివర్తింపచేస్తుంది. అందువల్లనే అనుభూతివాదులు పెద్దపెద్ద ప్రక్రియలను చేపట్టటం లేదు. అనుభూతివాదులంతా తమ రచనలకు ఖండకావ్య ప్రక్రియనే వాడుకుంటున్నారు. ఖండకావ్యం కాల్పనిక కవిత్వోద్యమంలో ప్రభవించిన ప్రధాన ప్రక్రియ. అందువల్లనే అనుభూతివాద కవిత్వం, కాల్పనికోద్యమ కవిత్వం ఒకటిగానూ, దగ్గర సంబంధం కలవిగానూ విమర్శకులు చెప్తున్నారు. అంతేకాదు, కాల్పనికోద్యమ కవులు సంప్రదాయంగా వస్తున్న మహాకావ్యాలను నిరాకరించి, ఖండకావ్య ప్రక్రియను చేపట్ట

అమెరికా ఉద్యోగ విజయాలు – 6

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న మనస్థత్వాలు బుధవారం రాత్రి. భోజనాలు పూర్తి చేసుకుని, వాకింగుకి వెళ్ళి వచ్చారు కృష్ణ, రుక్మిణి. ప్రతిరోజూ లాగానే అలవాటు ప్రకారం, కృష్ణ ఒక తెలుగు పుస్తకం, రుక్మిణి ఒక ఇంగ్లీష్ పుస్తకం తీసుకుని చదువుకుంటూ సోఫాలో కూర్చున్నారు. అప్పుడే ఫోన్ మ్రోగింది. అర్జున్. “బావా, భోజనాలయిపోయాయా? ఇప్పుడు ఆలస్యంగా పిలిచి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నానా?” అని అడిగాడు. “ఏం లేదులే చెప్పు. మనం మామూలుగా వారాంతాలే కదా మాట్లాడుకునేది. ఇప్పుడు వర్కింగ్ డే పిలిస్తే, ఏదన్నా ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాను. బాగానే వున్నావా?” అడిగాడు కృష్ణ. “నాకేం? సుబ్భరంగా వున్నాను. కాకపోతే ఒక ప్రశ్న. నీ సలహా అడుగుదామని..” అర్జున్. “ఫరవాలేదు, చెప్పు” అన్నాడు కృష్ణ. “మా క్వాలిటీ డిపార్ట్మెంట్ మీటింగుకి వెళ్ళాను ఇవాళ. అక్కడ క్వాలిటీ మేనేజర్, నలుగురైదుగురు ఇంజనీర్లు వున్నారనకో. వాళ్ళల్లో మూడు రకాల మనుష్యుల్ని చ

అమెరికా ఉద్యోగ విజయాలు – 5

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా..’ ఆరోజు కృష్ణ ఇంట్లో భోజనాలు అయాక, కృష్ణ అర్జనుడితో అన్నాడు, “వసంత ఋతువు వచ్చేసిందిగా.. అలా లేక్ ఆస్టిన్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుందాం పద” అన్నాడు. “మీరిద్దరూ వెళ్ళండి. నిర్మల వస్తానంది, మా ఇద్దరికీ వేరే పనుంది” అంది రుక్మిణి. “అయితే ఎక్కడో సేల్ వుంది, మేం వేరే వెడతాం అని అర్ధం అన్నమాట. సరే వెళ్ళండి. మేము ఒక గంటా, రెండు గంటల్లో వస్తాం” అన్నాడు కృష్ణ. ఆదివారం అవటం వల్ల లేక్ ఒడ్డున చాలమంది జనం వున్నారు. ఇద్దరూ దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చున్నాక , అర్జున్ అన్నాడు. “బావా, తాము చేసే ప్రతి పనిలోనే కాక, వారి జీవితంలో కూడా అడుగడుగునా విజయం సాధించాలని ప్రతివారికీ వుంటుంది. కానీ ఆ విజయ పథంలో విహరించటం ఎలా?” కృష్ణ అన్నాడు, “ముందుగా అసలు విజయం అనే మాటకి అర్ధమేమిటో తెలుసుకోవటం అవసరం. ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లోనూ, కొన్ని ఇంగ్లీషు సినిమాల్లోనూ చూస్

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
పైన చెప్పబడిన ప్రముఖుల భావాలు పరిశీలిస్తే భావకవితానంతర కాలంలో ప్రభవిల్లిన అభ్యుదయ కవిత్వం నియమాలకూ, నిబద్ధతకూలోనై వర్తిస్తుండగా, సామాజికావసర కారణంగానే అనుభూతి కవిత్వం పుట్టుకొచ్చిందనే తోస్తున్నది. అనుభూతి కవితావాదం విషయమై మంచి వ్యాసాన్ని ప్రభురించారు ఆర్.ఎస్. సుదర్శనంగారు. ఆ వ్యాసంలో వారు చేసిన వివేచన, విశ్లేషణ విలువైన అంశాలను అందిస్తున్నాయి. అనుభూతి కవిత్వంలోని నవ్యత హృదయానికి హత్తుకొని అనిర్వచనీయమైన, అనిర్ధిష్టమైన అనుభూతిగా మిగలాలి. ఇది పోలికల ద్వారా కానీ ఊహల అల్లికల ద్వారా కానీ ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణన ద్వారా కానీ కావచ్చు. ఒక ఖండిక చదివిన తర్వాత దానిలోనుంచి మనం ఎటువంటి సందేశాన్ని పొందనవసరం లేదు. అది మనకెటువంటి దృక్పథాన్నీ కల్గించాల్సిన అవసరం లేదు. ప్రాచీన కవితోద్దేశాలను పరిశీలిస్తే - “యద్వేదాత్ప్రభు సమ్మితాదధిగతం శబ్దప్రధానాచ్చిరం యచ్చేర్థ ప్రవణాత్పురాణ వచనాదిష్టం సుహృత్సమ్మి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
-డా. అక్కిరాజు రామాపతిరావు నందీశ్వరుడి శాపం నందీశ్వరుడు రావణుణ్ణి 'నా రూపాన్ని చూసి వెటకారం చేశావు కదా! నా వంటి వక్రరూపులైన కపులు నీ లంకపై దండు వెడలి నిన్ను సర్వనాశనం చేస్తారు' అని దశగ్రీవుణ్ణి శపించాడు. ‘నిన్ను ఒకే ముష్టిఘాతంతో చంపివేయగలను కాని, చచ్చిన వాణ్ణి చంపటమెందుకని ఉపేక్షిసున్నాను. ఇప్పటికే నీవు చచ్చినవాడి కింద లెక్క' అని క్రోధతామ్రాక్షుడై నంది రావణుణ్ణి నిరసించాడు. పార్వతీదేవి భయం పోగొట్టటానికి పరమశివుడు తాము కూచున్న గద్దె కిందికి తన పాదం చాచి కొండను తన కాలిబొటన వేలితో అదిమాడు. కొండ కింద రావణుడి శరీరం నలిగిపోయింది. తన భుజాలను, చేతులను దశకంఠుడు కొండ కింద నుంచి ఇవతలకు తీసుకోలేకపోయినాడు. కెవ్వుకెవ్వున కేకలు వేస్తూ కుయ్యో, మొర్రో అని ఆక్రందించాడు రావణుడు. అంగలార్చాడు. పదినోళ్ళతో మిన్నూమన్నూ ఏకమైపోయేట్లూ, ప్రచండపయోధరం గర్జించినట్లూ, ప్రళయకాలపు మబ్బులు ఉరుమురిమినట్లూ రోదించాడు. సమ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
అనుభూతి కవిత్వం ఒక వాదంగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో టి.యల్. కాంతారావుగారు ఎంతో ఆనందంగా ఈ వాదాన్ని గురించి చర్చించారు. వారి వారి భావాల్లో "భావ అభ్యుదయ కవితా ప్రక్రియల అనంతరం తిలక్ భావనా స్రవంతిలో వచ్చిన ఒకానొక విశిష్టపరిణామం అనుభూతి వాదం" అని చెప్పారు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ, “అనుభూతివాదం యొక్క పారమార్థిక లక్షణమేమిటంటే - కవి తన గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న అనేకానేక స్వచ్ఛమైన భావతరంగాలకి ఏ ఆర్భాటం లేకుండా స్పష్టమైన ఆకృతినివ్వటం.” ఈ వ్యాఖ్య సమగ్రమైన వ్యాఖ్యగా గమనింపగలం. స్వచ్ఛమైన భావతరంగాలు అనటంలో కవి హృదయంలోంచి కెరటాల వలే ఉవ్వెత్తుగా లేచే భావపరంపరకు ఏ నిబద్ధతా, ఏ నియమాలూ లేవు అని చెప్పటం గమనింపవచ్చు. ఆ భావాలు ఏ ఆర్భాటం లేకుండా ఉంటాయి అంటే భావకవిత్వంలో ఉండే స్వాప్నిక డోలికావిహారం ఇందులో లేదు అనుకోవచ్చు. స్పష్టమైన ఆకృతి ఇవ్వటం అనటంలో సమకాలీనంగా సాగిస్తున్న అభ్యుదయ కవులమని చెప్పుకునేవారు ర

రావణుడి శివాపచారం

ధారావాహికలు
అప్పుడు రావణుడు కుబేరుడి దివ్యభవన సింహద్వారం దగ్గరకు చొచ్చుకొని పోయినాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న సూర్యభానుడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించాడు. దాపులో ఉన్న ఒక స్తంభాన్ని పెకలించి దానితో దశకంఠుణ్ణి మోదాడు. అయతే బ్రహ్మ వర ప్రభావం వల్ల రావణుడు చావలేదు. కాని రక్తం కక్కాడు. దానితో ఒళ్ళు తెలియని కోపావేశంతో ఆ స్తంబాన్నే చేతపట్టి సూర్యభానుణ్ణి మోది వైరిని విగతజీవుణ్ణి చేశాడు. దీనితో యక్షుల బలం కకావికలమై పోయింది.కొందరు కుప్పకూలి పోయినారు. కొందరు గుహలలో దూరి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు నిశ్చేష్ట్రులైనారు. వాళ్లకు కాలు చేతులాడలేదు. అప్పుడు కుబేరుడు, మణిభద్రుడనే యక్ష ప్రముఖున్ని చూసి 'పాపాత్ముడైన, క్రూరపరాక్రముడైన రావణుణ్ణి వధించి యక్షులను రక్షించే భారం నీదే'నని ఆనతిచ్చాడు. అప్పుడు మణిభద్రుడు నాలుగువేల మంది యక్షవీరులతో బయలుదేరి రణభూమికి వచ్చాడు. యక్షులకు, రాక్షసులకూ పోరు ఘోరంగా జరిగింది. రాక్షసుల