జ్ఞాన భూములు
మన దేశ సంస్కృతి అంతా గంగానదితో పెనవేసుకొని ఉంది. గంగకు ఎగువున ఉన్న హిమాలయాలను దేవభూములు అని, గంగానది పర్వతాలనుండి మైదానాలకు వచ్చిన ఋషీకేశ్, హరిద్వార్ లను జ్ఞానభూములు అని, ఇంకా గంగకు దిగువ ప్రాంతమంతా కర్మభూమి అని పరిగణిస్తారు.
శివుని జటాజూటం నుండి బయలు వెడలి భగీరధుని వెంట ప్రయాణించిన పాయను భాగీరధి అంటారు. ఇది గంగోత్రి వద్ద గోముఖం ద్వారా బయటకు వస్తుంది. గంగోత్రి నుండి ఋషీకేశ్ కి వచ్చే దారిలో 5 ప్రయాగలు (సంగమ స్థానాలు) ఉన్నాయి.
(1) విష్ణుప్రయాగ వద్ద అలకనంది దౌళీగంగతో కలిసి ముందుకు సాగి (2) నంద ప్రయాగ వద్ద నందాకినితో కలిసి సాగుతుంది. (3) కర్ణ ప్రయాగ వద్ద పిండారినదితో కలిసిన అలకనంద (4) రుద్ర ప్రయాగ వద్ద భాగీరధితో కలుస్తుంది. ఇక నుండి గంగానదిగా పిలవబడుతూ, ఋషీకేశ్ ను చేరుతుంది. ఇక్కడ గంగానది రెండు కొండల మధ్య యిరుకైన దారిలో పరవళ్ళు తొక్కుతూ 30కి||మీ|| ముందుకు సాగి హరిద్వార్ వద్ద సమతుల ప్రదేశం